‘క్షమించమని మనస్ఫూర్తిగా కోరుతున్నా’

AP Deputy CM Narayana Swamy Apology - Sakshi

సాక్షి, పుత్తూరు: ముస్లింలు, మత గురువులు తనను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుతున్నానని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ఆదివారం పుత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శనివారం తిరుపతిలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం దురదృష్టకరమన్నారు. జమాత్‌ నుంచి వచ్చిన ముస్లింలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కలిగించే ప్రయత్నం చేశానన్నారు. భావ వ్యక్తీకరణలో లోపం కారణంగానే తాను చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయన్నారు. తన వ్యాఖ్యలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరణ ఇచ్చానని చెప్పారు.  

ఇది చదవండి: కరోనాపై పోరుకు కదం తొక్కుతూ..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top