తిరుపతిలో విషాదం | 3died in tirupathi | Sakshi
Sakshi News home page

తిరుపతిలో విషాదం

Mar 22 2017 11:29 AM | Updated on Sep 5 2017 6:48 AM

తిరుపతిలో విషాదం

తిరుపతిలో విషాదం

నీటికుంటలో పడిన పిల్లలని కాపాడపోయి ఓ తల్లి మృతిచెందింది.

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి తల్లీ, కుమారుడు, కుమార్తె మృతిచెందారు. బట్టలు ఉతకడానికి నీటి కుంట వద్దకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు.

తిరుపతి శివారు పాతకాలువలో ఓ మహిళ బట్టలు ఉతకడానికి వెళ్లింది. ఆమెతో పాటు కుమారుడు, కుమార్తె కూడా వచ్చారు. అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునగడం గుర్తించిన మహిళ వారిని రక్షించే క్రమంలో నీట మునిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement