టీడీపీ ఎంపీ సుజనా చౌదరి దోపిడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించట్లేదని వైస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. వేల కోట్లు రూపాయలను అక్రమంగా దోచుకున్న సుజనాపై పవన్ స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో నాలుగు కోట్లు విలువచేసే భూమిని కేవలం 20 లక్షలకే మీకు కట్టబెట్టినందుకు మాట్లాడంలేదా? అని విమర్శించారు. అధికారంలో ఉన్న టీడీపీ నేతలను ప్రశ్నించకుండా ప్రతిపక్ష పార్టీని విమర్శించడం సరికాదన్నారు.
టీడీపీ ఎంపీ దోచుకుంటే పవన్ స్పందించరా?
Nov 27 2018 11:32 AM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement