శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్‌ఆర్‌సీపీ

గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్‌ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రధానంగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించకుండానే ఫలితాలను ఏవిధంగా ప్రకటిస్తారని గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, మంగళగిరి శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ అంశాన్ని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామని వారు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్వో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ  ఎల్లుండి (బుధవారం) న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top