శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ
గుంటూరు, శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండానే ఫలితాలను ఏవిధంగా ప్రకటిస్తారని గుంటూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మంగళగిరి శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ అంశాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామని వారు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్వో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎల్లుండి (బుధవారం) న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు