మంచి చేసినవారు కలకాలం గుండెల్లో నిలిచిపోతారంటారు. ఈరోజు ఎంతోమంది నాన్నగారి వల్ల తమకు జరిగిన మేలు చెప్పుకొని నాకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం ఓ అక్క కలిసింది. కులాంతర వివాహం చేసుకోవడంతో అటుఇటు రెండు కుటుంబాలూ దూరం పెట్టాయట. కట్టుబట్టలతో గడప దాటిన పరిస్థితి. ఆ కష్టకాలంలో నాన్నగారి దయ వల్ల ఆ అక్క ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందట. రాజీవ్ యువశక్తి ద్వారా అందిన లోన్తో చిన్నగా చీరల వ్యాపారమూ మొదలెట్టిందట. ఆపై ఏఎన్ఎంగా ఉద్యోగం వచ్చి జీవితంలో కాస్త స్థిరపడటంతో.. మళ్లీ రెండు కుటుంబాలు చేరువయ్యాయట. ఒకానొక సమయంలో ఆరోగ్య శ్రీ పుణ్యమా అని ఉచితంగా ఆపరేషన్ కూడా జరిగిందట. నేడు నేను పాదయాత్రగా వస్తున్నానని తెలిసి.. తమ రెండు కుటుంబాల వారంతా పక్కా తెలుగుదేశం వారైనా, ఎవరేమనుకున్నా ఫరవాలేదనుకొని వచ్చి నన్ను కలిసింది. తన గుండెల్లో దాచుకున్న అభిమానాన్ని కృతజ్ఞతగా తెలియజేసింది.
265వ రోజు పాదయాత్ర డైరీ
Sep 19 2018 6:46 AM | Updated on Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement