టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి నామా రాజీనామా | Telangana Leader Nama Nageswara Rao Quits TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి నామా రాజీనామా

Mar 20 2019 7:34 AM | Updated on Mar 22 2024 11:29 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఖమ్మం మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వర్‌రావు టీడీపీని వీడారు. పొలిట్‌బ్యూరో సభ్యత్వంతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తెలంగాణలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నానని, పార్టీకి పునర్వైభవం కల్పించేందుకు అనేక ఇబ్బందులకు ఓర్చి కష్టపడ్డా తెలంగాణ గడ్డపై టీడీపీ మనుగడ సాగించే అవకాశాలు లేవని లేఖలో పేర్కొన్నా రు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement