విషాదం; గ్యాస్‌ లీకై ఏడుగురి మృతి | Seven People Died After Gas Leakage In Sitapur In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

విషాదం; గ్యాస్‌ లీకై ఏడుగురి మృతి

Feb 6 2020 4:49 PM | Updated on Mar 22 2024 11:10 AM

 కెమికల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకవడంతో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందిన ఘటన గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలోని చోటుచేసుకుంది.కాగా మృతి చెందినవారిలో ముగ్గరు పిల్లలు ఉన్నట్లు తేలింది. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని తమ పరిధిలోకి తీసుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. జిల్లా ఎస్పీ ఎల్‌ఆర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బిస్వాన్‌ ప్రాంతంలో ఉన్న కెమికల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పేలుడు సంభవించిందని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement