రేపటి నుంచి మిల్లర్లు అందరూ ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ధాన్యంతో పాటు పత్తి, వేరుశెనగ, మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొన్నిచోట్ల మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు.