నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో అధికారులు తనిఖీలు | Metrology Department Rides In Hyderabad | Sakshi
Sakshi News home page

Aug 2 2018 3:48 PM | Updated on Mar 22 2024 11:07 AM

నగరంలోని మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్‌లపై తూనికలు కొలతల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయిన కూడా వారు నిబంధనలకు పాటించడంలేదని వార్తలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ పరిధిలోని ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌, ఉప్పల్‌ ఏషియన్‌, ఏఎస్‌ రావు నగర్‌లోని రాధిక, జీవీకే మాల్‌, కాచిగూడ ఐనాక్స్‌తో పాటు ఇతర మల్టీప్లెక్స్‌ల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement