పోలవరం రివర్స్‌ టెండరింగ్‌తో రూ.58కోట్లు ఆదా | Max Infra Takes Polavaram Project In Reverse Tendering | Sakshi
Sakshi News home page

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌తో రూ.58కోట్లు ఆదా

Sep 20 2019 7:34 PM | Updated on Sep 20 2019 7:39 PM

పోలవరం ప్రాజెక్టు టెండరింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నం ఫలించింది. పోలవరం లెఫ్ట్‌ కనెక్టివిటీ పనుల్లో 65వ ప్యాకేజీ టెండర్‌ ఖరారైంది. టీడీపీ హయాంలో పోలవరం 65వ ప్యాకేజీ పనులను రూ. 292.09 కోట్లకు పనులు దక్కించుకున్న మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ తాజాగా రూ. 231.47 కోట్లకు టెండర్‌ దక్కించుకుంది. బిడ్‌లో ఆరు కంపెనీలు పోటీపడగా.. 15.6 శాతం తక్కువకి మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ టెండర్‌ వేసింది. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే సంస్థ కేవలం 4.8 శాతం ఎక్కువకి టెండర్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో ప్రభుత్వానికి రూ. 58.53కోట్లు ఆదాకానుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement