టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాష్టీకాలకు అడ్డుఅదుపూలేకుండా పోతోంది. న్యాయం చేయాలని కోరేందుకు ఇంటికి వచ్చిన దివ్యాంగునిపైనా ఆయన దాడికి తెగబడ్డారు. ఆయన చెంపదెబ్బలతో కళ్లు తిరిగి కిందపడిపోయిన ఆ దివ్యాంగుడిని కాళ్లతో తన్ని మరీ తన కసిని ప్రదర్శించారు. అడ్డువచ్చిన అతని 70ఏళ్ల వృద్ధ తల్లినీ చెంపపై కొట్టటంతోపాటు, 80ఏళ్ల వృద్ధ తండ్రి రంగారావును డొక్కల్లో కాళ్లతో తన్నారు. తీవ్ర అస్వస్థతతో దివ్యాంగుడు ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లగా అక్కడి వైద్యులు పైకి దెబ్బలేమీ కనిపించటంలేదనీ, మెడికల్ లీగల్ కేసు చేయటానికి అవకాశం లేదని చెప్పి పంపించివేశారు.
దివ్యాంగునిపై చింతమనేని దాష్టీకం
Jun 22 2018 11:03 AM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement