-
దివ్యాంగునిపై చింతమనేని దాష్టీకం
-
మరోసారి రెచ్చిపోయిన చింతమనేని..!
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి): టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాష్టీకాలకు అడ్డుఅదుపూలేకుండా పోతోంది. న్యాయం చేయాలని కోరేందుకు ఇంటికి వచ్చిన దివ్యాంగునిపైనా ఆయన దాడికి తెగబడ్డారు. ఆయన చెంపదెబ్బలతో కళ్లు తిరిగి కిందపడిపోయిన ఆ దివ్యాంగుడిని కాళ్లతో తన్ని మరీ తన కసిని ప్రదర్శించారు. అడ్డువచ్చిన అతని 70ఏళ్ల వృద్ధ తల్లినీ చెంపపై కొట్టటంతోపాటు, 80ఏళ్ల వృద్ధ తండ్రి రంగారావును డొక్కల్లో కాళ్లతో తన్నారు. తీవ్ర అస్వస్థతతో దివ్యాంగుడు ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లగా అక్కడి వైద్యులు పైకి దెబ్బలేమీ కనిపించటంలేదనీ, మెడికల్ లీగల్ కేసు చేయటానికి అవకాశం లేదని చెప్పి పంపించివేశారు. దెందులూరు గ్రామం కాసీ కాలనీకి చెందిన దివ్యాంగుడు సంపంగి సింహాచలం తెలిపిన వివరాలు.. సింహాచలం తన కాలనీలో కిళ్లీకొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సింహాచలం ఇంటిలో అద్దెకు దిగిన ఈదుపల్లి రామారావు క్రమంగా ఆ ఇంటిని ఆక్రమించాడు. దీంతో సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇంటి తగాదా విషయం కోర్టులో ఉంది. అయితే ఇటీవల భీమడోలు సీఐ ఇద్దరినీ పిలిపించి వివాదంపై విచారణ చేశారు. ఎమ్మెల్యే చింతమనేని తనకు అండగా ఉన్నారని, ఇంటిలోని సింహాచలం సామానులన్నీ బయట వేయమన్నారని విచారణలో రామారావు చెప్పాడు. ఎమ్మెల్యేను కలసి ధ్రువీకరించుకోవాలని సింహాచలానికి సీఐ సలహాఇచ్చారు. దీంతో గురువారం ఎమ్మెల్యే చింతమనేని ఇంటికి సింహాచలం, అతని తల్లిదండ్రులు రంగారావు, అప్పలనరసమ్మ కలసి వెళ్లారు. న్యాయం చేయాలని కోరగా ఆగ్రహించిన చింతమనేని.. సింహాచలంపై చేయిచేసుకుని చెంపలపై గట్టిగాకొట్టారు. అడ్డువచ్చిన సింహాచలం తల్లి చెంపపై గట్టిగా కొట్టి.. తండ్రి డొక్కల్లో బలంగా తన్నారు. సింహాచలాన్ని తన్నుతూ.. దుర్భాషలాడుతూ నీకు దిక్కున్న చోట చెప్పుకోవాలని హెచ్చరించారు. సింహాచలాన్ని అతని తల్లిదండ్రులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు పట్టించుకోలేదు. చింతమనేని దౌర్జన్యంపై ఏలూరు త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. -
ఇంట్లోకెళ్తే చంపేస్తామంటున్నారు!
– ఇంటి చుట్టూ రాళ్లు అడ్డుపెట్టిన ప్రత్యర్థులు – ఆపై మారణాయుధాలతో బెదిరింపులు ఆత్మకూరు : ఆత్మకూరు మండలం దొడ్డే కొట్టాల గ్రామంలో రెండు కుటుంబాల మధ్య దాయాది పోరు రగులుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. భూ వివాదమే దీనికంతటికీ కారణమైంది. రెండ్రోజుల నుంచి తమను ఇంట్లోకి వెళ్లనీయకుండా ప్రత్యర్థులు అడుగడుగునా అడ్డుపడుతున్నారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇంట్లోకి వెళ్లకుండా చుట్టూ రాళ్లు అడ్డుపెట్టి, ఆపై మారణాయుధాలతో బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం... అసలు కథలోకి వెళ్తే... గ్రామంలో కృష్ణా అనే వ్యక్తి తమ తాత ముత్తాతల నుంచి సంక్రమించిన 13.80 ఎకరాలను అనుభవిస్తున్నాడు. ఇటీవల కృష్ణా పెదనాన్న కుమారులైన రాజశేఖర్, ఎర్రన్న, సాయినాథ్, శ్రీనివాసులు, రవికుమార్ అనే వ్యక్తులు బెదిరించి బలవంతంగా ఏడెకరాలను తమ పేరిట రాయించుకున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే శుక్రవారం సాయంత్రం తన పొలంలోకి ప్రత్యర్థుల గొర్రెల మంద రావడాన్ని కృష్ణా ప్రశ్నించారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు అదే రాత్రి.. మీరు ఇంట్లోకి ఎలా వస్తారో చూస్తామంటూ బెదిరించారు. ఇంట్లోకి వెళ్లకుండా చుట్టూ రాళ్లు అడ్డుపెట్టారు. ఆపై ఐదుగురు మారణాయుధాలతో తిరుగుతూ తమను భయభ్రాంతులకు గురి చేశారని కృష్ణా కుటుంబ సభ్యులు తెలిపారు. రెండ్రోజులుగా ఇంట్లోకి వెళ్లలేక, బయటే ఉంటున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. మిగిలిన పొలంతో పాటు ఇళ్లను సైతం తమకు రాసిచ్చేయాలని హుకుం జారీ చేశారని తెలిపారు. మర్రెమ్మ అనే వృద్ధ అంధురాలిపై సైతం కనికరం లేకుండా ఇంట్లోకి రానీయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పోలీసులు చెప్పినా... ప్రత్యర్థుల దుర్మార్గంపై తాము ఆత్మకూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. వారొచ్చి చెప్పినా తమ ప్రత్యర్థులు వినలేదని తెలిపారు. చివరకు తామే ప్రాణాలకు తెగించి రాళ్లను తొలగించామన్నారు. మంత్రి అండ చూసుకునే... తమ ప్రత్యర్థులు ఇంతగా బరితెగించడానికి కారణంగా జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలు చూసుకునేనని కృష్ణ కుటుంబ ఆరోపించింది. పొలం, ఇళ్ల విషయమై సదరు మంత్రి ఇంటి వద్ద పంచాయితీ సైతం జరిగిందని తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement