సాక్షి, విజయవాడ : ప్రముఖ నటుడు మహేశ్బాబు సతీమణి నమ్రత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నమ్రత వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. అలాగే ఆలయ ఈవో చేతుల మీదుగా నమ్రతకు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.