నటనతో కోటాను కోట్ల మంది ప్రేమను పొందిన శ్రీదేవికి మరణం లేదని, అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఉదయం ఆమె మరణ వార్తను వినగానే ఒక్కసారిగా షాక్ గురయ్యానని చెప్పారు. వాస్తవాన్ని జీర్ణించుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనసు మనసులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఇంత చిన్న వయసులో శ్రీదేవిని తీసుకెళ్లి ఆ భగవంతుడు అన్యాయం చేశారన్నారు. శ్రీదేవి వంటి నటి గతంలో ఎవరూ లేరని, భవిష్యత్తుల్లో వస్తారని కూడా భావించడం లేదని చెప్పారు. శ్రీదేవికి నటన తప్ప మరొకటి తెలియదని..మరో ధ్యాస కూడా లేదన్నారు. అంతటి అంకిత భావం ఉన్న నటిని చూడలేమన్నారు. శ్రీదేవి అంకితభావాన్ని చూసి తాను కూడా ఎంతో నేర్చుకున్నానని, స్పూర్తి పొందానని చెప్పారు.
Feb 25 2018 1:45 PM | Updated on Mar 20 2024 3:19 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement