విధ్వంసక ఇన్నింగ్స్ తో క్రిస్ గేల్ డబుల్ సెంచరీ.. శామ్యూల్స్ సెంచరీతో మోతెక్కించడంతో ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ఛేదించలేకపోయింది. 44.3 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది. జింబాబ్వే ఆటగాళ్లలో విలియమ్స్ కాసేపు పోరాటం చేసినప్పటికీ ఫలితాన్ని మార్చలేకపోయాడు. 61 బంతుల్లో 9 ఫోర్లతో 76 పరుగుచేసిన విలియమ్స్ ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అవుటయ్యాడు. ఇర్విన్ అర్థసెంచరీ(52) సాధించాడు. ఓపెనర్ రజా 26, టెయిలర్ 37, కెప్టెన్ చిగుంబుర 21 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, టెయిలర్ చెరో మూడు వికెట్లు తీయగా డబుల్ సెంచరీ వీరుడు క్రిస్ గేల్ బౌలింగ్ లోనూ మాయాజాలం చేశాడు. 6 ఓవర్లు వేసిన గేల్.. 35 పరుగులిచ్చి 2 వికెట్లు నేలకూల్చాడు. శామ్యూల్స్ కు ఒక వికెట్ దక్కింది. ఆద్యంతం అద్భుత ప్రదర్శననిచ్చిన క్రిస్ గేల్ నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
Feb 24 2015 8:13 PM | Updated on Mar 21 2024 8:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement