రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో మరో ఆసక్తికర మ్యాచ్కు మరికాసేపట్లో తెరలేవనుంది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ పివి సింధు, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ల తుది పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సింధు పసిడి పతకంతో కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ ఓడినా రజతంతో సగర్వంగా భారత్ కు తిరిగి వస్తుంది.