భారతగడ్డపై తొలిసారి అట్టహాసంగా నిర్వహించిన ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచకప్లో ఇంగ్లండ్ ‘కిక్’ అదిరింది. ‘లయన్స్‘ విజృంభణతో ఆ జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది. శనివారం ఇక్కడి సాల్ట్లేక్ స్టేడియంలో భారీ సంఖ్యలో హాజరైన అభిమానులను అలరించిన ఫైనల్లో ఇంగ్లండ్ 5–2 తేడాతో స్పెయిన్ను చిత్తుగా ఓడించింది.