20వేల మంది రోడ్డున పడుతున్నా... | Sakshi
Sakshi News home page

20వేల మంది రోడ్డున పడుతున్నా...

Published Tue, Nov 22 2016 9:01 AM

దివీస్‌ రసాయనాల పరిశ్రమ వల్ల 13 గ్రామాల్లో 25 వేల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా టీడీపీ ప్రభుత్వం ఆ పరిశ్రమకు కొమ్ముకాస్తుండటంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఎగిసిపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతంలోని తొండంగి మండలం దానవాయిపేట వద్ద దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పరిశ్రమను స్థాపిస్తున్నారు. ఇందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న 20 వేల మంది రోడ్డున పడుతున్నా.. ఏటా రూ.16 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం నష్టపోతున్నా, గాలికొదిలేసిన సర్కారు.. స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది.

Advertisement
Advertisement