నేటినుంచి షర్మిల పరామర్శయాత్ర | Y.S.Sharmila Paramarsha Yatra Starts Today | Sakshi
Sakshi News home page

Jun 29 2015 7:28 AM | Updated on Mar 22 2024 10:59 AM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల సోమవారం నుంచి రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడలో మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి యాత్ర ప్రారంభిస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement