పార్లమెంట్‌లో టపాసులు పేలతాయనుకున్నా.. | We were expecting fireworks, instead got a damp squib: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

Feb 1 2017 2:23 PM | Updated on Mar 21 2024 8:11 PM

‘రైలు ప్రమాదాల్లో వందల సంఖ్యలో జనం చనిపోతున్నారు. గిట్టుబాటుధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువతను నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోంది. దేశంలో ఇన్ని సమస్యలతొ కొట్టుమిట్టాడుతుండగా వీటిలో కనీసం ఒకదానిగురించైనా నేటి బడ్జెట్‌లో మాట్లాడారా?’అని ప్రశ్నించారు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. బడ్జెట్‌ ప్రసంగం పూర్తైన తర్వాత పార్లమెంట్‌ వెలుపల రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కారు కీలకమైన సమస్యలను గాలికొదిలేసి, చలోక్తులు, చతురులతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement