మహారాష్ట్రలోని భీవండిలో గత అర్థరాత్రి ఓ భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నగరంలో ప్రముఖ అసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. కాగా శిథిలాలకింద మరి కొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు 29 మందిని రక్షించారు. కూలిన ఆ భవనంలో గార్మెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన వస్తువులను భద్రపరిచేవారు.
Jul 4 2013 11:44 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement