అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ ఉపఎన్నికలో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బుధవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు బాటలోనే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు బేరసారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి పదవులను కైవసం చేసుకోవడం టీడీపీకి సాంప్రదాయంగా మారిందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.
Dec 14 2016 1:43 PM | Updated on Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement