'రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారు' | Ravela kishore babu allegations on ysrcp | Sakshi
Sakshi News home page

Sep 4 2015 9:29 AM | Updated on Mar 21 2024 7:46 PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదని వైఎస్సార్ సీపీ కోరుకుంటోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపించారు. శుక్రవారం శాసనసభలో వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్సార్ సీపీ పట్టుబట్టింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్ సీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని నిందించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తమ సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement