రైలు ప్రయాణం చేయాలంటే ఇకపై తప్పనిసరిగా బీమా చెల్లించాల్సిందే. యూపీలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్ తీసుకుంటే 92 పైసల్ని బీమా రూపంలో కట్టించుకుని జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐఆర్సీటీసీ కల్పిస్తున్న ఆన్లైన్ రిజర్వేషన్ విధానంలో జారీ చేసే టికెట్లకు మాత్రం బీమా చెల్లింపునకు ఆప్షన్ విధానం కల్పించారు. ఈ ఆప్షన్ విధానాన్ని తొలగించి బీమా చెల్లింపును తప్పనిసరి చేస్తూ ఆన్లైన్ రిజర్వేషన్ విధానానికి సవరణలు చేయనున్నారు. దీనిపై రైల్వే మంత్రిత్వశాఖ త్వరలో ప్రకటన చేయనుంది.
Nov 24 2016 7:11 AM | Updated on Mar 21 2024 9:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement