సచివాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా | Municipal Workers Strike || Congress Protest Against Government Infront Of Secretariat | Sakshi
Sakshi News home page

Jul 18 2015 6:53 AM | Updated on Mar 21 2024 6:45 PM

మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా శుక్రవారం సచివాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సంఘీభావంగా తాము నిరసనకు దిగామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్మికులందరికీ ప్రభుత్వం వేతనాల పెంపును వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న ఉత్తమ్, భట్టి విక్రమార్క, కె.జానారెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్, ఎం.ఏ.ఖాన్, పొన్నాల లక్ష్మయ్య, పొంగులేటి సుధాకరరెడ్డి, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, డి. శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, వై. అనిల్‌కుమార్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement