పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం | Lok Sabha passes the Andhra Pradesh Reorganisation Bill | Sakshi
Sakshi News home page

Jul 11 2014 1:04 PM | Updated on Mar 20 2024 3:11 PM

నిరసనలు, నినాదాల మధ్యే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు శుక్రవారం లోక్ సభలో ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. దీంతో పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఆంధ్రప్రదేశ్‌లోకి కలుపుతూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుకు చట్టబద్ధత లభించింది. సభ్యుల నిరసనలతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశాలను మధ్యాహ్నం రెండు గంటలవరకూ వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement