తరాలుగా నలుగుతున్న మాదిగల వర్గీకరణను సాధించే క్రమంలో ఆదివారం నిర్వహించనున్న ‘ధర్మయుద్ధ’మే అంతిమ యుద్ధమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన దళిత కులాలు వర్గీకరణతోనే లబ్ధి పొందుతాయని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ పేర్కొన్నారు. ఈనెల 27న సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్సలో తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభ ద్వారా వర్గీకరణ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వానికి చాటిచెబుతామని స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.