యూనివర్సిటీలో గొడవ.. విద్యార్థి అదృశ్యం | JNU student misses after brawl in university | Sakshi
Sakshi News home page

Oct 20 2016 7:41 AM | Updated on Mar 20 2024 3:53 PM

దేశ రాజధానిలోని ప్రఖ్యాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఒక విద్యార్థి అదృశ్యమయ్యాడు. హాస్టల్లో జరిగిన గొడవ తర్వాతే అతడు కనిపించకపోవడంతో.. అతడి తల్లిదండ్రులు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీలో చదువుతున్న నజీబ్ అహ్మద్.. కేవలం 15 రోజుల క్రితమే యూనివర్సిటీలో చేరాడు. ఇక్కడకు వచ్చి తమ కొడుకు కనిపించకుండా పోయాడని.. అతడు ఎక్కడున్నాడని నజీబ్ తల్లి ఆవేదనగా ప్రశ్నించారు. అతడికి ఏమైందో కూడా తెలియడం లేదని.. తన కొడుకును తిరిగివ్వాలని అడిగారు. ఉత్తరప్రదేశ్‌లోని బదయూ ప్రాంతానికి చెందిన ఆమె.. అర్ధరాత్రి ఫోన్ కాల్ రావడంతో కంగారు పడుతూ వచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement