'రెడ్యానాయక్ చేరిక కుటిల రాజకీయం కాదు' | ds-redya-naik-maluju-kavita-joins-trs | Sakshi
Sakshi News home page

Nov 4 2014 6:25 PM | Updated on Mar 21 2024 7:53 PM

దళితులు, గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. గిరిజన తండాలను పంచాయతీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఆయన కూతురు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత మంగళవారం సాయంత్రం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రెడ్యానాయక్ చేరికను కుటిల రాజకీయ చేరికలా చూడడం లేదని వ్యాఖ్యానించారు. గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అండదండలు అందించాలన్న ఉద్దేశంతో ఆయన తమ పార్టీలో చేరారని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం చరిత్రలో కనీవినీ ఎరుగని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీలోని గిరిజన నాయకులు ఐక్యంగా పనిచేయాలని కేసీఆర్ కోరారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement