తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి తీరుపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్రంగా మండిపడ్డారు. నగర కాంగ్రెస్ ను విభజించి పబ్బం గడుపుకోవడానికి మర్రి చూస్తున్నారని విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడిన దానం.. తనకు చెప్పకుండా హైదరాబాద్ లో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. తనకు చెప్పకుండా పార్టీ వ్యవహారాలు నడపడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. నగర అధ్యక్షునిగా తాను పనికి రాను అనుకుంటే మరో నేతను తీసుకునే అధికారం పొన్నాలకు ఉందని.. అయితే మర్రి శశిధర్ రెడ్డి ఏనాడు కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేయలేదన్నారు. తాను పదవి లేకున్నా.. కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు. అధికార పార్టీతో, సీఎంతో పైరవీలు తనకు అవసరం లేదని దానం స్పష్టం చేశారు.'మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓ డిజాస్టర్. ఢిల్లీ చుట్టూ తిరిగి పెద్దనేత అనుకుంటున్నాడు. నాకు చెప్పకుండానే ఇళ్ల నిర్మాణ అంశంపై నగర నేతలతో కలిసి గవర్నర్ కలవడం సరికాదు' అని దానం విమర్శించారు.
'నేను పనికి రాను అనుకుంటే తీసేయండి'
Published Thu, Jan 29 2015 4:08 PM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement