తోటి విద్యార్థులే వేటకొడవళ్లతో నరికి చంపారు | Co-students killed a student in Anantapur district | Sakshi
Sakshi News home page

Jun 29 2015 10:46 AM | Updated on Mar 22 2024 10:59 AM

రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న తోటి విద్యార్థిని చూసి ఓర్వలేక పవన్‌కుమార్(18) అనే వ్యక్తిని తోటి విద్యార్థులే కిరాతకంగా హతమార్చారు. జిల్లాలోని సూర్యానగర్ కంటి ఆసుపత్రి వద్దపవన్‌ను వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. కొన ఊపిరితో ఉన్న పవన్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరణించాడు. జిల్లాలోని బోయవీధికి చెందిన తలారి నగేష్‌తో పాటు మరో ఆరుగురు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement