చంద్రబాబు నీవు నిప్పులాంటి వాడివా? | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నీవు నిప్పులాంటి వాడివా?

Published Mon, Aug 29 2016 3:41 PM

టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..’చంద్రబాబు తాను నిప్పు, నిజాయితీపరుడని అంటున్నారని, నిజంగా చంద్రబాబు నిప్పుయితే వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కోట్లు ఇచ్చి కొన్నట్లు. ఎమ్మెల్యేను కొన్న డబ్బంతా ఎక్కడిది? చంద్రబాబు నీ డొల్లతనం, నీ నైజం ఏంటో అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోవాలి. ఏదైనా మేనేజ్ చేయవచ్చనే ధైర్యం చంద్రబాబుకు ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజమా?.

Advertisement
Advertisement