నెలలు నిండకముందే పుట్టిన బిడ్డను ఓ తల్లి చెత్తకుప్పపాలు చేసింది. గమనించిన ఆటోడ్రైవర్..ఆ పసిపాపను కాపాడి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మెడికేర్ ఆసుపత్రి వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..పాణ్యం మండలం కొణిదేడు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, ఆమె భర్త వెంకట్వేర్లు మెడికేర్ ఆసుపత్రికి వచ్చారు. కడుపునొప్పి అధికంగా ఉందని లక్ష్మిదేవికి చెప్పడంతో వైద్య సిబ్బంది స్కానింగ్ చేసి గర్భిణిగా నిర్ధారించారు. కాని ఆమెకు ప్రసవ వేదన ప్రారంభం కావడంతో ఆసుపత్రి చివరలో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Oct 7 2016 9:52 AM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement