మక్కాలో మరో పెను విషాదం | Sakshi
Sakshi News home page

మక్కాలో మరో పెను విషాదం

Published Thu, Sep 24 2015 2:16 PM

మక్కాలో గురువారం మరో పెను విషాదం చోటుచేసుకుంది. హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి సుమారు 150మంది హజ్ యాత్రికులు దుర్మరణం చెందారు. మరో 500మందికి పైగా గాయపడ్డారు. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది. 15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందినవారుగా ఉన్నారు.