సిలికాన్ వ్యాలీ దిగ్గజం ఆపిల్ ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది. గత 15 ఏళ్లలో మొదటిసారి కంపెనీ యాన్యువల్ విక్రయాలు, లాభాలు పడిపోయినట్టు కంపెనీ రిపోర్టు చేసింది. 1997లో దివాలా స్థానం నుంచి ప్రపంచ అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిన ఆపిల్, సెప్టెంబర్తో ముగిసిన ఈ మూడో త్రైమాసికంలో కేవలం 215.6 బిలియన్ డాలర్ల(రూ.14,40,433కోట్ల) విలువైన ఐఫోన్స్, వాచస్ను, మ్యాక్ కంప్యూటర్లు, ఇతరాత్ర ఉత్పత్తులను మాత్రమే విక్రయించినట్టు మంగళవారం రాత్రి పేర్కొంది. గతేడాది ఈ విక్రయాలు 233.7 బిలియన్ డాలర్లు(రూ.15,61,243కోట్ల)గా నమోదయ్యాయి. కంపెనీ యాన్యువల్ విక్రయాల్లో క్షీణత, లాభాలపై దెబ్బకొట్టినట్టు ఆపిల్ ప్రకటించింది.