తమిళనాడు రాష్ట్ర రాజకీయ భవితవ్యంపై బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళ చెప్పినట్లుగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేయరని, అలాంటి పరిస్థితి లేదని అన్నారు. దాంతో ఆ పార్టీలో చీలిక తప్పదని ఆయన తేల్చిచెప్పారు.