సినీ కళాకారుల సంఘం (మా) అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోంది. ఈ పదవికి తాను దూరంగా ఉండనున్నట్లు ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు. దాంతో ఆ పదవిని చేపట్టేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించారు. అయితే.. ఈలోపు ఈ పదవికి తాను రంగంలో ఉంటానంటూ సహజనటి జయసుధ ముందుకొచ్చారు. ఆమెకు 'మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ మద్దతు పలికారు. ఆయన మద్దతుతో జయసుధ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక దశలో మంచు విష్ణు కూడా ఈ పదవికి పోటీ పడతారన్న కథనాలు వచ్చాయి గానీ.. ఆయన వాటిని ఖండించారు. తాను పోటీలో ఉండేది లేదని స్పష్టం చేశారు. దాంతో ఇప్పుడు 'మా' అధ్యక్ష పదవి బరిలో రాజేంద్రప్రసాద్, జయసుధ నిలవడం దాదాపు ఖాయమైంది.
రాజేంద్రప్రసాద్ vs జయసుధ
Published Fri, Mar 20 2015 4:17 PM
Advertisement
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement