పెరిగిన బంగారం ధరలు వస్త్ర వ్యాపారాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. సెకండ్ ముంబైగా పేరు పొందిన ప్రొద్దుటూరుకు బంగారు కొనుగోళ్ల నిమిత్తం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. బంగారు నగలు కొన్న తర్వాత స్థానికంగానే బట్టలు కూడా కొనుగోలు చేసి వెళ్తుంటారు. పెరిగిన ధరల కారణంగా బంగారు కొనుగోలు చేసేవారు తక్కువయ్యారు. ఈ కారణంగా మా వ్యాపారాలు జరగడం లేదు. పైగా జీవనోపాధి లేపోవడం కూడా ఒక కారణం
– కృష్ణ, వివేకానంద హోల్సేల్ క్లాత్మార్కెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరి, ప్రొద్దుటూరు


