● తనూజ...నెరవేరిన ఆకాంక్ష
మదనపల్లె సిటీ : కృషి, పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యం సాధించింది ఎం.ఎస్.తనూజ. రూ.లక్షల్లో జీతమిచ్చే కొ లువు ఉన్నా ప్రభుత్వ ఉ ద్యోగం చేయాలనే ఆశయంతో శ్రమించింది. తొలిసారే గ్రూప్–1 రాసి మున్సిపల్ కమిషనర్–గ్రేడ్ 2 ఉద్యోగానికి ఎంపికై ంది. మదనపల్లెలోని సొసైటీకాలనీకి చెందిన ఏసీటీఓ శివప్రసాద్, శశికళ కుమార్తె తనూజ ప్రాథమిక విద్య స్థానిక విజయభారతి ఉన్నత పాఠశాల, ఉన్నత విద్య చైతన్య టెక్నో, పాలిటెక్నిక్ పద్మావతి వర్సిటీలో చదివారు. బీటెక్ ఈసీఈ ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేసిన ఆమె కొంతకాలం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు.


