బైకులు ఢీకొని యువకుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైకులు ఢీకొని యువకుడికి గాయాలు

Oct 19 2025 6:37 AM | Updated on Oct 19 2025 6:37 AM

బైకులు ఢీకొని యువకుడికి గాయాలు

బైకులు ఢీకొని యువకుడికి గాయాలు

చింతకొమ్మదిన్నె : మండలంలోని ఊటుకూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొనడంతో యల్లటూరు ప్రదీప్‌ అనే యువకుడికి గాయాలయ్యాయి. కాలు విరగడంతో ప్రదీప్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్లను

సద్వినియోగం చేసుకోవాలి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ బొనాంజా ఆఫర్లను ప్రవేశ పెట్టిందని జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ ముజీబ్‌ పాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్‌లో ఒక రూపాయికే 30 రోజుల పాటు ఉచిత వాయిస్‌ కాల్స్‌, 2 జీబీ డేటా, వంద ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయన్నారు. సిమ్‌ కూడా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌ కేర్‌ యాప్‌ ద్వారా గాని, వెబ్‌సైట్‌ ద్వారా గానీ రూ.100 అంతకంటే ఎక్కువ రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు ప్రతి రోజు పది మందిని లక్కీ డిప్‌ ద్వారా ఎంచుకొని ఒక్కొక్కరికి సిల్వర్‌ కాయిన్‌ గిఫ్ట్‌ ఇస్తామన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్‌ యాప్‌ ద్వారా మిత్రులకు గాని, కుటుంబ సభ్యులకు గాని రీచార్జ్‌ చేసినట్లయితే రీ చార్జ్‌ అమౌంట్‌లో 25 శాతం డిస్కౌంట్‌ లభిస్తుందన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌ కోసం రూ.1812కే 365 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, ప్రతి రోజు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయన్నారు. సిమ్‌ ఉచితంగా ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement