గ్రహణం ఎఫెక్ట్‌.. ఆలయాలు మూసివేత | - | Sakshi
Sakshi News home page

గ్రహణం ఎఫెక్ట్‌.. ఆలయాలు మూసివేత

Sep 8 2025 7:13 AM | Updated on Sep 8 2025 7:13 AM

గ్రహణం ఎఫెక్ట్‌.. ఆలయాలు మూసివేత

గ్రహణం ఎఫెక్ట్‌.. ఆలయాలు మూసివేత

గ్రహణం ఎఫెక్ట్‌.. ఆలయాలు మూసివేత

కడప సెవెన్‌రోడ్స్‌: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో ఏర్పడింది. ఈ కారణంగా దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 1.50 గంటలకు మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున ఉదయం 6.00 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. అలాగే మున్సిపల్‌ హైస్కూలు వద్దగల శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం, గడ్డిబజారులోని శ్రీ బాలాజీ ఆలయం, బిల్టప్‌ వద్దగల శ్రీ విజయదుర్గాదేవి ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంతోపాటు ఇతర ఆలయాలను కూడా మూసివేశారు.

ఒంటిమిట్ట రామాలయం మూసివేత

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆదివారం మూతపడింది. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రామాలయాన్ని మధ్యాహ్నం 1:50 గంటలకు మూసివేసినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ కుమార్‌ తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున సుప్రభాతసేవ, ఆలయశుద్ధి, పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం యథావిధిగా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు.

రాయచోటి వీరభద్రాలయం

రాయచోటి టౌన్‌: చంద్రగ్రహణం సందర్భంగా రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని మూసివేశారు. అలాగే పాత రాయచోటిలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం, చెక్‌పోస్ట్‌ వద్ద వెలసిన శ్రీ శివాలయ తలుపులు, యండపల్లె సమీపంలోని శ్రీ భైవరవుడి ఆలయాలను కూడా మూసివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement