త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి | - | Sakshi
Sakshi News home page

త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి

Jun 10 2025 7:10 AM | Updated on Jun 10 2025 7:10 AM

త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి

త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి

కడప ఎడ్యుకేషన్‌ : ఉపాధ్యాయ ఉద్యమంలో ఆనాటి త్యాగధనుల జీవితాల నుంచి నేటి తరం స్ఫూర్తి పొందాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వీణా విజయరామరాజు ఎస్టీయూ భవన్‌లో వైఎస్సార్‌ కడప జిల్లా అధ్యక్షుడు ఇలియాస్‌ బాషా అధ్యక్షతన 79 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జెండా ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేసి, వీణా విజయరామరాజు మరియు మఖ్దుం మొహిద్దీన్‌లకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఏడు దశాబ్దాల ఉపాధ్యాయ ఉద్యమంలో వీణా విజయరామరాజు, మఖ్దుం మొహిద్దీన్‌, వి.పి. రాఘవాచారి, పెర్నా శ్రీరామ మూర్తి లాంటి నాయకులు ఉద్యమాల ద్వారా ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణను, ట్రిపుల్‌ బెనిఫిట్‌ స్కీమ్‌ ద్వారా పెన్షన్‌, గ్రాట్యుటీ,క మ్యుటేషన్‌ , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పొందే సౌకర్యాన్ని అందించారన్నారు, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు కె. సురేష్‌ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలగంగి రెడ్డిలు మాట్లాడుతూ నేటి నవతరం నాయకులు విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలన్నారు. జిల్లా ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్‌, జిల్లా నాయకులు షేక్‌ సాజిత్‌, షేక్‌ సాదిక్‌, నాగేంద్రప్రసాద్‌, మహబూబ్‌ బాషా, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాసులు, బాలరాజు, కరీముల్లా, కస్తూరి ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement