
ఎస్జీటీలకు కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్ : సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు (ఎస్జిటి) మ్యానువల్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు డీఈఒ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో కడప శంకరాపురం స్కౌట్ హాల్లో కౌన్సెలింగ్ను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో రాత్రి ఏడు గంటల వరకు ఎస్జీటీలు వేచి చూడాల్సి వచ్చింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎంపీపీ మేనేజ్మెంట్కు సంబంధించి 2410, కడప కార్పొరేషన్ ఉర్దూ, పొద్దుటూరు మున్సిపాలిటి పరిధిలో మరో 130 పోస్టులకుగానూ ఎస్జీటీలకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంంది. మంగళవారం రాత్రి పొద్దపోయే వరకూ 360 మందికి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. బదిలీల పక్రియ ఈ నెల 14వతేదీ నాటికి ముగుస్తుందని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సాంకేతిక సమస్యలతో
రాత్రి ఏడు గంటలకు ప్రారంభం