
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
చింతకొమ్మదిన్నె : కడప నగరం సాక్షి సర్కిల్ నుంచి రాయచోటి సర్కిల్ వైపునకు వెళుతూ జయరాజ కల్యాణ మండపం సమీపంలో రింగు రోడ్డుపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీశాంత్ (23)కు తీవ్ర గాయాలవగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్సు ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు ప్రకాశం జిల్లాకు చెందిన వారని సమాచారం.
కారు వ్యవహారంలో
వ్యక్తి అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : కారు కొనుగోలు వ్యవహారంలో ఓ పాఠశాలలో పనిచేస్తున్న గణేష్ను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. గణేష్ రూరల్ పరిధిలోని ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం గుంటూరు జిల్లాలోని వినుకొండలో ఉంటున్న కోటేశ్వరరావు స్కార్పియో వాహనాన్ని అద్దె ప్రాతిపదికన తెచ్చుకున్నాడు. అద్దె డబ్బులను కారు కంతులు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని రోజులు గణేష్ అద్దె చెల్లించాడు. తర్వాత అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో కొన్ని రోజుల క్రితం కోటేశ్వరరావు ప్రొద్దుటూరుకు వచ్చి పాఠశాల ఆవరణలో స్కార్పియో కారును తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గణేష్ అడ్డుకొని బలవంతంగా అతన్ని బయటకి తోసేశాడు. దీంతో కోటేశ్వరరావు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం గణేష్ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ అరుణ్రెడ్డి తెలిపారు.
పట్టపగలే
యువకుడి కిడ్నాప్
కలకడ : పట్టపగలే యువకుడిపై దాడిచేసి కిడ్నాప్ చేసిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం కలకడ టౌన్లో జరిగింది. ఎస్ఐ రామాంజనేయులు కథనం మేరకు.. కలకడ టౌన్ గుర్రంకొండ రోడ్డు సందువీఽధికి చెందిన పర్వీన్ను ఐదేళ్ల కిందట రాయచోటికి చెందిన ఖాజాకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ క్రమంలో ఖాజా భార్య పర్వీన్ అన్నదమ్ములకు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఇచ్చిన నగదు ఇవ్వాలని నాలుగు సంవత్సరాలుగా కోరుతున్నా తిరిగి చెల్లించడం లేదని ఖాజా మంగళవారం మధ్యాహ్నం మరో ఆరుగురు అనుచరులతో కలకడకు వచ్చి తౌలిక్ ఆలీని కిడ్నాప్ చేశారు. కట్టి కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. బుధవారం కిడ్నాప్కు గురైన తౌలిక్ అల్లి (లాలు)తల్లి షేక్ కౌషిక్ ఫిర్యాదు మేరకు ఖాజా, మరో ఆరుగురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు.
ఏడుగురిపై కేసు నమోదు