ఏడాది పాలన అంతా మోసం | - | Sakshi
Sakshi News home page

ఏడాది పాలన అంతా మోసం

Jun 13 2025 5:19 AM | Updated on Jun 13 2025 5:19 AM

ఏడాది పాలన అంతా మోసం

ఏడాది పాలన అంతా మోసం

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల: కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా మోసపూరితమని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన పులివెందులలోని తన స్వగృహం వద్ద మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం రూ.1.51 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగిందని, కానీ ప్రజలకు మాత్రం ఏ సంక్షేమ పథకాన్ని అందజేయలేదన్నారు. రైతు భరోసా, అమ్మఒడి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు, మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇలా అనేక రకాల హామీలను ఏడాదైనా అమలు చేయలేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో మొదటి ఏడాది పాలనలో సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులు, 2.75 లక్షల మంది వలంటీర్లను నియమించడం జరిగిందన్నారు. అలాగే పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేశారన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారన్నారు. అమ్మఒడి ద్వారా విద్యా ర్థుల తల్లులకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్స్‌, నోటు బుక్స్‌ వంటివి విద్యా కా నుక ద్వారా అందించారని తెలిపారు. మహిళల భద్ర త కోసం దిశ యాప్‌ను ప్రవేశ పెట్టారన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా అందించడమేకాక రాయితీపై విత్తనాలు, ఎరువులు సరఫరా చేశారన్నా రు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం అప్పట్లో కొనుగోలు చేసిందన్నారు. ప్రజల కు ఇచ్చిన ఏ హామీని విస్మరించకుండా కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత దేశంలోనే ఒక్క వైఎస్‌ జగనన్నకే దక్కుతుందన్నారు. అలా కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రస్తుత ప్రభుత్వం ఏడాది పాలనపై సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అనంతరం ప్రజా దర్బార్‌ నిర్వ హించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

జర్నలిస్టుల క్రికెట్‌ టీంను అభినందించిన ఎంపీ

గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్‌ పోటీలలో విజేతగా నిలిచిన కడప జర్నలిస్టుల టీంను ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పట్టణంలోని తన నివాసం వద్ద అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే క్రీడలలో రాణించాలని ఆయన కోరారు. త్వరలో రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు పులివెందులలో నిర్వహించాలని, అందుకు తాను పూర్తిగా సహకరిస్తానని జేశాప్‌ నాయకులకు హామీ ఇచ్చారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కలిసిన వారిలో జేశాప్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, జేశాప్‌ రాష్ట్ర సలహాదారు భూమిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టా మాధవరెడ్డి, టీం సభ్యులు షరీఫ్‌, పఠాన్‌, శేషు, అరుణ్‌, ప్రభంజన్‌ రెడ్డి, జయ రామకృష్ణారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, శివకేశవరెడ్డి, సురేంద్ర తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement