డీఐపీఆర్వోకు ఆత్మీయ వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

డీఐపీఆర్వోకు ఆత్మీయ వీడ్కోలు

Jun 14 2025 7:27 AM | Updated on Jun 14 2025 7:27 AM

డీఐపీఆర్వోకు ఆత్మీయ వీడ్కోలు

డీఐపీఆర్వోకు ఆత్మీయ వీడ్కోలు

కడప సెవెన్‌రోడ్స్‌: శ్రీ సత్యసాయి జిల్లా డీఐిపీఆర్వోగా బదిలీపై పుట్టపర్తికి వెళుతున్న వైఎస్‌ఆర్‌ కడప జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ డీఐపీఆర్వో పి.వేణుగోపాల్‌ రెడ్డిని ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ ప్రాంగణంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐపీఆర్వోతోపాటు బదిలీపై వెళ్తున్న డివిజనల్‌ పీఆర్వో మస్తాన్‌ సాహెబ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ జయశాంత శరీఫాలను ఆ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది వారి మనోభావాలను వ్యక్తం చేస్తూ.. బదిలీ అయిన వారితో వారికి విధి నిర్వహణలో ఉన్న అనుభవాలు, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎలాంటి విమర్శలు, వివాదాలకు తావు లేకుండా శాఖాధిపతిగా డీఐ పీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి చేసిన సేవలను కొనియాడారు.

● ఈ సందర్భంగా డీఐపీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కడప కార్యాలయంలో విధి నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ ప్రాంత వాతావరణం, ఇక్కడి మీడియా మిత్రుల అభిమానం, అధికారులు సిబ్బంది సమన్వయ సహకారం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఈ సందర్బంగా డీఈఐఈ శ్రీనివాసరావు, డివిజనల్‌ పీఆర్వో సునీల్‌ సాగర్‌, పీఆర్వో రవికుమార్‌, ఏవీఎస్‌ నాగయ్య, రికార్డ్‌ అసిస్టెంట్‌ ఈశ్వరయ్య, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, టైపిస్టులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement