
లబ్ధిదారుల సంఖ్య తగ్గించరాదు
జిల్లాలో అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్యను 30 వేలకు పైగా తగ్గించడం సబబుగా లేదు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించకుండా ఎన్నికల ముందు చెప్పిన విధంగా రూ.20 వేలను ఈ ఖరీఫ్ సాగు ఖర్చులకు గాను ఒకే విడతలో విడుదల చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ ప్రధాన వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున విడతల వారీగా కాకుండా ఒకే విడతలో రైతు ఖాతాలకు జమ చేయాలి. అలాగే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్నదాత సుఖీభవ నిధులను వారికి కూడా అందించాలి. – పోతిరెడ్డి భాస్కర్, ఏపీ రైతు సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి