
రెండు రోజుల్లో కౌన్సిల్ హాలు తెరవాలి
కడప కార్పొరేషన్: ‘కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగే కౌన్సిల్ హాలులో ఏ మర్మం దాగి ఉందో ఎవరికీ తెలియడం లేదు.. నేను స్వయంగా కౌన్సిల్ హాలు తెరవాలని కోరినా కమిషనర్ స్పందించడం లేదు’ అని మేయర్ సురేష్బాబు అన్నారు. గురువారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను చిన్నచూపు చూస్తోందని, ఏడాది పాలనలో వారు ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కూటమి సర్కార్ రాష్ట్రంలో దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల్లను అక్రమంగా కై వసం చేసుకుందన్నారు. అందులో భాగంగానే కడప కార్పొరేషన్లో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వర్ధిని కనస్ట్రక్షన్స్ సంస్థ తనకు తెలియకుండా రిజిస్టర్ అయిందని, రిజిస్టర్ అయినప్పటి నుంచి ఆ సంస్థ చేసిన పనులు రూ.36 లక్షలలోపే అన్నారు. ఈ పనుల్లో ఎక్కడా అవినీతి జరగలేదని, నాణ్యతా లోపాలు కూడా లేవన్నారు. అయినా కోట్ల రూపాయలలో స్కాం జరిగిందంటూ దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు.
కార్పొరేటర్లకు ఆహ్వానం
పంపకుండా అవమానం
కార్పొరేషన్లో సర్వసభ్య సమావేశం నిర్వహించే కౌ న్సిల్ హాలుకు తాళాలు వేశారని, తాళాలు తీసి ఓపె న్ చేయాలని తాను స్వయంగా అడిగినా కమిషనర్ స్పందించడం లేదన్నారు. సమావేశ మందరంలో ఏ మర్మం దాగి ఉందోనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. నగరపాలక అధికారులు ఒకరిపై ఒకరు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని, తాళాలు ఎక్కడ ఉన్నాయో కమిషనర్ తెలపాలన్నారు. రెండు రోజుల్లో కౌన్సిల్ హాలు తెరవకపో తే మీడియా సమక్షంలో తామే తాళాలు ఓపెన్ చేస్తా మని హెచ్చరించారు. కడప కార్పొరేషన్లో పాలకవర్గంగా ఉన్న తమ మాట అఽధికారులు వినడం లేదని, అన్ని డివిజన్లలో కార్పొరేటర్లకు ఆహ్వానం పంపకుండా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు.
చట్టం ప్రకారం నడుచుకున్నాం
గతంలో మేయర్గా తన విచక్షణాధికారాలను వినియోగించి కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు ఎక్స్ అఫిసియో సభ్యుల హోదాలో వేదికపై కుర్చీలు వేశామన్నారు. కడప ఎమ్మెల్యే మాధవి అహంకార పూరిత వైఖరి చూశాక చట్టం ప్రకారం నడుచుకున్నామని, మేయర్కు తప్ప మరెవరికీ వేదికపై కుర్చీలు వేయలేదన్నారు. దీంతో గత రెండు సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవి నానా రచ్చ చేశారని, తాను మేయర్గా ఉంటే కార్పొరేషన్లో తనకు కుర్చీ ఉండదని గ్రహించి తనను ఎలాగైనా దించేయాలని కుట్ర పన్నారన్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి పార్టీ మారేలా చేశారన్నారు. మిగతా వారు రాకపోవడంతో తన కుమారుడి కాంట్రాక్టు సంస్థను బూచిగా చూపి అనర్హత వేటు వేయాలని ప్రయత్నించారన్నారు.
న్యాయసమ్మతం కాదు
ఒక కాంట్రాక్టు సంస్థను మున్సిపాలిటీల్లో రిజిస్ట్రేషన్ చేయడం చెల్లదని.. అయినా చేశారన్నారు. రూ.10 లక్షలలోపు పనులు తన దృష్టికి వచ్చే అవకాశమే లేదన్నారు. దీని ఆధారంగా తనపై అనర్హత వేటు వేయాలనుకోవడం న్యాయసమ్మతం కాదన్నారు. ఈ నెల 16న విచారణకు తప్పకుండా హాజరవుతానని, తన వివరణను ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పాకా సురేష్, మల్లికార్జున, రామలక్ష్మణ్రెడ్డి, మగ్బూల్బాషా, డివిజన్ ఇన్చార్జులు శ్రీరంజన్రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, సుబ్బరాయుడు, ఐస్క్రీం రవి పాల్గొన్నారు.
కార్పొరేషన్కు ‘మహా’ నష్టం
మహానాడు సందర్భంగా కడప కార్పొరేషనన్్ పరిధిలో ఎన్నో ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లు కట్టారని, కానీ కార్పొరేషన్కు ఒక్క రూపాయి కూడా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ చెల్లించలేదన్నారు. దీనివల్ల నగరపాలక సంస్థకు లక్షల రూపాయల్లో నష్టం జరిగిందన్నారు. కార్పొరేషన్లో కమిషనర్ మనోజ్రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని, పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దౌర్భాగ్య పాలన లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. మేయర్గా తనకే ఇలాంటి దౌర్భాగ్య పరి స్థితులు ఉంటే కార్పొరేటర్లు, సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు.
లేనిపక్షంలో మీడియా సమక్షంలో తెరుస్తాం
నగరపాలక అధికారులుప్రొటోకాల్ పాటించడం లేదు
మేయర్గా సురేష్ ఉంటే కుర్చీ ఉండదు..అనర్హత వేటు వేసి తొలగిస్తే అడ్డు ఉండదనే కుట్రలు
కడప మేయర్ కె.సురేష్బాబు కీలక వ్యాఖ్యలు