
హౌసింగ్ బోర్డు చోరీ కేసులో పురోగతి
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన చోరీ కేసులో టూటౌన్ పోలీసులు పురోగతి సాధించారు. బుధవారం రాత్రి సీఐ సదాశివయ్య కేసు వివరాలను మీడియాకు తెలిపారు. హౌసింగ్బోర్డు కాలనీలోని గోపిరెడ్డి శివశంకర్రెడ్డి ఇంట్లో ఈ ఏడాది మార్చి 15న చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంట్లో సుమారు 249 గ్రాముల బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. ఈ కేసులోని నిందితులు జంగా వెంకటరావు, సుధాకర్లను ఇటీవల ఇతర జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్పై ఇద్దరినీ ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరిచి, కోర్టు అనుమతి మేరకు పోలీస్ కష్టడిలోకి తీసుకొని ఆభరణాలను రికవరీ చేశారు. వీటిలో కొంత బంగారాన్ని నిందితులు విక్రయించారు. బద్వేల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో దాచిన మిగిలిన 180 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిన్నచౌక్ పరిధిలో జరిగిన చోరీకి సంబంధించిన బంగారు నగలను స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదించిన సీఐ సదాశివయ్య, ఎస్ఐలు ధనుంజయ, రాఘవేంద్రారెడ్డి, సిబ్బందిని ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ భావన అభినందించారు.