
నన్నే కారు తీయమంటావా..
పీలేరు రూరల్ : అడ్డంగా పెట్టిన కారు పక్కకు తీయాలని అడిగిన సెక్యూరిటీ గార్డుపై నన్నే కారు తీయమంటావా అంటూ ఓ టీడీపీ నాయకుడు విరుచుకుపడిన సంఘటన బుధవారం జరిగింది. బాధితుడి వివరాల మేరకు.. ఏరియా ఆస్పత్రిలో బుధవారం పట్టణానికి చెందిన తుమ్మల ధరణికుమార్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఆయన విధులు నిర్వర్తించే సమయంలో టీడీపీ నాయకుడు మహేష్ వచ్చారు. ఆస్పత్రి ఆవరణలో రోడ్డుపై అడ్డంగా కారు పార్క్ చేశాడు. కారు పక్కకు తీయాలని అక్కడే ఉన్న ధరణీ కుమార్ కోరారు. దీంతో ఆవేశంగా నన్నే కారు తీయమంటావా.. అంటూ ధరణికుమార్పై మహేష్ దాడి చేశాడు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడతో దళిత సంఘాల నాయకులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు టిఎల్.వెంకటేష్, సుధాకర్ బాబు, సుభాష్, బోదేషా పాల్గొన్నారు.